Headlines

కోనసీమ జిల్లాలో పర్యటించిన దళిత ముద్దు బిడ్డ, అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు మన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్

ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ సీఐడీ గా పదోన్నతి పొందిన తరువాత మొట్టమొదటిసారిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన దళిత ముద్దు బిడ్డ, అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు మన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు

డాక్టర్ బి. అర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా //అమలాపురం

అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్సై మరియు కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థిని అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమం అమలాపురం అంబేద్కర్ భవన్ నందు నిర్వహించారు..

ముందుగా ఏపీ డీజీపీ సీఐడీ మన్యశ్రీ పీవీ సునీల్ ఐపీఎస్ గారు మరియు కొత్తపేట జడ్పిటిసి &స్టేట్ HMFW మెంబర్ గూడపాటి రమాదేవి రమాదేవి ప్రవీణ్ కుమార్ (G.p) జ్యోతి ప్రజ్వల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

పివి సునీల్ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థిని అభ్యర్థులను పర్యవేక్షించి వారికి ఫ్రీ మెటీరియల్ పంపిణీ చేశారు

అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా సాధనలో కృషిచేసిన జేఏసీ నాయకులను పివి సునీల్ గారు సత్కరించారు