Headlines

రాంపల్లి లో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ సుగుణ

 

కొండపాక: కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో సోమవారం సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ ర్యాగల్ల సుగుణదుర్గయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుగుణ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన పది లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. అర్హత గల మదిర గ్రామాలన్నింటినీ సీ.ఎం కేసీఆర్ గ్రామపంచాయతీలుగా గుర్తించి పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన దక్షతతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోల సద్గుణ రవీందర్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ర్యాగళ్ళ దుర్గయ్య, స్థానిక సర్పంచ్ చిట్కుల లతా సురేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, పి. ఆర్ .ఏ. ఈ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.