పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో ఉస్తాద్ భగత్సింగ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..ఇప్పుడు రెండో షెడ్యూల్ కు సిద్ధమైంది.
ఈ విషయాన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ఆయన ట్వీట్ చేసారు.
”రెండో షెడ్యూల్కు యాక్షన్ చెప్పడానికి ఎగ్జైటింగ్గా ఉన్నా’ అంటూ మనల్ని ఎవడ్రా ఆపేది’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ ట్వీట్ వైరల్ అవుతోంది. రెండో షెడ్యూల్ పక్కా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. పవన్కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం బ్లాక్బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే! 11 ఏళ్ల తర్వాత పవన్ – హరీశ్శంకర్- దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఆయన సరసన హీరోయిన్గా శ్రీలీలా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.