Headlines

టీడీపీతో బీజేపీ పొత్తు, ఏంటి వ్యూహం – తేల్చేసిన కమలం పార్టీ ముఖ్య నేత..!!

బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి టీడీపీతో జత కడుతోందా. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ముందుగా ప్రతిపాదించారు.

విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో 2014 పొత్తులు ఏపీలో రిపీట్ కానున్నాయనే వాదన మొదలైంది. ఈ సమయంలో బీజేపీ ముఖ్య నేత ఓబీసీ మోర్చా అధ్యక్షుడు..ఎంపీ లక్ష్మణ్ కర్నూలులో క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యూహం తేల్చి చెప్పారు.

బీజేపీ ఆలోచన మారలేదు : పొత్తుల విషయంలో బీజేపీ ఆలోచన మారే అవకాశం లేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేసారు. ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. స్వయంగా పార్టీని అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం లో ఎవరు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేసారు.