Headlines

సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం , జూన్ 23 :

స్థానిక 24 వ వార్డు యాగర్లపల్లి పుట్టా కొట్టు ఎదురుగా రెండు వీదులు సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 200 మీటర్లు పొడవునా సిసి రోడ్డు వాటికి ఇరువైపులా సీసీ డ్రైనేజీలను నిర్మించనున్నారు. వార్డు బాట హామీలు అమలులో భాగంగా మున్సిపల్ జనరల్ నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టూ టౌన్ సచివాలయాల కన్వీనర్ కర్రి భాస్కరరావు ,వన్ టౌన్ సచివాలయాల కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ ,మున్సిపల్ ఇంజనీర్ డి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.