Headlines

నంది అవార్డు గ్రహీత బాల బ్రహ్మము కు శుభాకాంక్షలు తెలియజేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి

 

కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బూర్గోజు బాల బ్రహ్మం గారికి ఉత్తమ జ్యోతిష్కునిగా నంది అవార్డు పొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ బాల బ్రహ్మంగారు ప్రజల బాగోగుల కోసం ప్రజా అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి ఉత్తమ జ్యోతిష్కుని కి నంది అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బారాస మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మల్లమారి రవీందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సున్నం భాస్కర్, వార్డు మెంబర్లు పాతకోటి లింగం, సాదు పల్లి కనక సేన, గాండ్ల కనకసేన, పిట్ల దర్గయ్య, కాశిరెడ్డి రవీందర్, వంగ శ్రీనివాస్, పి కనకయ్య, కిష్టయ్య చింతల కృష్ణయ్య, సుభాష్ తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు……