Headlines

వడ్డెర ఓబన్న సంఘం నూతన కమిటీ ఎన్నిక

 

యాడికి:

యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డులోని వడ్డెర కాలనీలో వడ్డెర ఓబన్న సంఘం నూతన కమిటీని వడ్డెర కుల బాందవుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా మక్కల వెంకటరమణను, మండల అధ్యక్షులుగా మక్కల రామాంజనేయులును ఎన్నుకున్నారు. అలాగే మండల ఉపాధ్యక్షునిగా మంజుల నాగార్జునను, ప్రధాన కార్యదర్శిగా మంజుల శివ, మండల కోశాధికారిగా కొత్తూరు కంభగిరిరాముడును, సహాయ కార్యదర్శిలుగా మొక్కల నాగేంద్ర, దేరంగుల ఆదిలను ప్రచార కార్యదర్శిలుగా యుగంధర్, రమేష్, వీరాంజి, ప్రవీణ్ కుమార్, రాంబాబులను కార్యకర్తలుగా సురేష్, పెద్ద సుధాకర్, భాస్కర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వడ్డెర సంఘం అభివృద్ధికి, వడ్డెర జాతి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. అలాగే మా కులానికి న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కుల పెద్దలు శంకర్, శ్రీనివాసులు, రాముడు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.