బస్సు యాత్ర గోడపత్రిక ఆవిష్కరణ

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 19:

పెంటపాడు లో సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర గోడ పత్రికను సిపిఐ మండల పార్టీ కార్యదర్శి కలింగ లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, సిపిఐ మండల సమితి సభ్యులు కొణతాల నాగరాజు, దేపల్లి విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలింగ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించండి… దేశాన్ని కాపాడండి విశాఖ నుండి తిరుపతి వరకు బస్సు యాత్ర ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 8 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేపట్టింది. దీనిలో భాగంగా ఈనెల 22 న తణుకు బస్సు యాత్రను పెంటపాడు మండల సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.