Headlines

కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

 

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కదిరి టిడిపి ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ చంద్రబాబుకు తోడుగా మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను ఎత్తివేయాలని చంద్రబాబు విడుదల అయ్యేంతవరకు మా దీక్షలు కొనసాగిస్తామని, రాబోయే ఎన్నికలలో వైసిపి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు బూత్ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు,టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.