Headlines

నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడిగా ముత్యాల స్వామి

 

ఎండపల్లి, ఇదే నిజం

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం లోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏడు మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గా ముత్యాల స్వామి, గౌరవ అధ్యక్షునిగా అమరపెల్లి నారాయణ, కార్యవర్గ సభ్యులుగా పసుపునూటి అనిల్, పాల గణేష్, కనకయ్య, రాచమల్ల మల్లేశం లను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల స్వామి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయి బ్రాహ్మణ కుల సభ్యుల సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయి బ్రాహ్మణ కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధానకార్యదర్శి గంగిపెల్లి వేణుమాధవ్,కంది తిరుపతి, ఎండపల్లి మండల ప్రధాన కార్యదర్శి మందపెల్లి శ్రీనివాస్ లతోపాటు నియోజకవర్గంలోని ఏడు మండలాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.