Headlines

భారీగా హాషిష్ ఆయిల్ స్వాధీనం..

పత్రిక ప్రకటన:

భారీగా హాషిష్ ఆయిల్ స్వాధీనం..

మల్కాజిగిరి ప్రొహిబిషన్& ఎక్సైజ్ అధికారి శ్రీ డి.అరుణ్ కుమార్ అదేశాల మేరకు,AP&ES శ్రీ బి.ముకుందరెడ్డి పర్యవేక్షణలో మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అల్వాల్ లోని కాణాజిగూడ, ఇన్సూరెన్స్ కాలనీలో ఒక ఇంటి లో నిల్వ ఉంచిన హషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు..బోయిన్పల్లి హస్మాత్ పేట్ కి చెందిన గోపాగోని విశాల్,బండరీ రవితేజ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5,00,000 విలువ చేసే 150 హషిష్ ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలను(1050గ్రాములు) వాటితో పాటు రెండు ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు.. మూడవ వ్యక్తి డాకురి యాదగిరి పరారీలో ఉన్నాడు..విశాఖపట్నం లోని అజ్ఞాత వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైద్రాబాద్ లో అవసరం ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభం పొందుతున్నామని సదరు నిందితులు తెలిపారు.. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ గారు తెలిపారు.. ఇట్టి తనిఖీలలో మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్ సింగ్,ఎస్.ఐ లు కుమారస్వామి,బాలక్రిష్ణ,సిబ్బంది పాల్గొన్నారు.