యాడికి మండలం రాయల చెరువు గ్రామ సమీపంలో చెరువు గుట్ట వద్ద వృద్ధురాలు చీరతో ఉరి..

న్యూస్.9) యాడికి మండలం రాయల చెరువు గ్రామ సమీపంలో చెరువు గుట్ట వద్ద వృద్ధురాలు చీరతో ఉరి వేసుకొని చనిపోయిన విషయం.

పెద్దవడుగురు మండలం క్రిష్టిపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కుసుం బీ , 65 yrs, భర్త ఖాసిం సాబ్ late, గత సం. నుండి కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి, ఈరోజు ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఇంటి నుండి తన అన్న ఇంటికి వెళుతున్నానని చెప్పి రాయల చెరువు గ్రామ సమీపంలోని చెరువు గుట్ట వద్ద మృతురాలు ధరించిన చీరతో వేపచెట్టు కొమ్మకు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఈమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు సంతానం కలరు. వీరి స్వగ్రామం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం, రామాపురం గ్రామం. వీరు గత పది సంవత్సరాల కిందట తమలపాకుల వ్యాపారం నిమిత్తం క్రిష్టిపాడు గ్రామానికి వచ్చి స్థిరపడడం జరిగింది. కుసుంబి పెద్ద కుమారుడు మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేబట్టడం జరిగింది.

ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపారుయాడికి పియస్.