న్యూస్.9)
అనంతపురం, యాడికి :
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని జర్నలిస్ట్ అసోషియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జోగిరెడ్డిలు పేర్కొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వీరు అనంతపురం, పుట్టపర్తి జిల్లాలలో నూతన కమిటీలు వేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, అలాగే గుత్తి, మండలాలలో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. యాడికి మండల కేంద్రంలోని బోగలింగేశ్వర స్వామి దేవాలయంలో 20 మందితో సభ్యత్వ నమోదు చేయించారు. వీరందరూ వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పనిచేస్తున్నారు. జర్నలిస్టుకి మీడియా పరంగా కాకుండా యూనియన్ మద్దతు చాలా అవసరం భావించి అక్కడున్నటువంటి సమస్యలపై పోరాడటానికి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) యూనియన్ లో స్వతహాగా ఎటువంటి ఒత్తిడి లేకుండా సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జోగిరెడ్డిలు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జర్నలిస్టులు పైన వ్యక్తిగతమైన దాడులు పాల్పడుతూ రాజ్యాంగ బద్ధమైనటువంటి జర్నలిజానికి వ్యతిరేక శక్తులుగా మారుతున్నారన్నారు. కేవలం ఈ కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఇతరత్రా సోషల్ మీడియా చేస్తున్నటువంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని బయటికి పంపిస్తూ జర్నలిజానికి ముడి పెడుతున్నారన్నారు. జర్నలిస్టులు సోషల్ మీడియా వేరు వేరుగా పనిచేస్తాయని తెలియక పొలిటికల్, వ్యాపార సంస్థల యొక్క ప్రతినిధులు వ్యక్తిగతంగా తీసుకుని జర్నలిజాన్ని అవహేళనగా చేస్తున్నారన్నారు. ఈ సమయంలో జర్నలిస్టు వారి యొక్క భద్రత ప్రశ్నర్థకంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా జర్నలిస్టులపై జరిగిన దాడులను జాప్ తీవ్రంగా ఖండించి బాధితుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో సభ్యత్వం చేసుకోవడానికి, మండల నియోజకవర్గ స్థాయి కమిటీలను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శుక్రవారం 20 మంది జర్నలిస్టు సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి గౌతమి గాయిత్రి ఎడిటర్ యాడికి మండల జాప్ యూనియన్ సభ్యులు సారెడ్డి రామచంద్రారెడ్డి, రఘు, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బాలకృష్ణ, సుధాకర్, శర్మాస్ వలి, నారాయణస్వామి, సుబ్బారెడ్డి, హుస్సేన్ రహంతుల్లా, తిరుమలరెడ్డిలు పాల్గొన్నారు.