Headlines

కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 సంవత్సరాల బాలుడు దక్షిత్ కు ఆర్థిక సాయం కోసం వినతి

ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లి పూర్వ విధ్యార్తుల సంక్షేమ సంఘం కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 సంవత్సరాల బాలుడు దక్షిత్ కు ఆర్థిక సాయం అందించింది .
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ వినోద్ కుమారి్ 3సంవత్సరాల కుమారుడు దక్షిత్ విద్యుత్ ఘాతానికి గురై రెండు కాళ్ళు కోల్పోయాడు .ఈ విషయం ఈ నాడు దినపత్రికలో కథనం వెలువడింది.దీనిపై స్పందించన సొసైటీ గౌరవాధ్యక్షులు మరియు బిజెపి జాతీయ కార్యదర్శి శ్రి వై.సత్యకుమార్ గారు వెంటనే తన సంఘ సభ్యులను కాకినాడకు పంపించి 24 గంటల్లో రూ లక్ష రూపాయలు చెక్ ను బాధిత కుటుంబానికి అందేలా చేశారు .కరోనా సమయంలో సత్యకుమార్ తన స్వంత ఖర్చులతో కిటి్ లు మరియు ఆర్థిక సహాయం చేశారు .అంతే కాదు తను 35 సంవత్సరాల క్రితం చదివిన కాలేజి పూర్వ విధ్యార్థుల కోసం సొసైటీని ఏర్పాటు చేసి అవసరమైన సమయాల్లో ఆదుకుంటున్నారు .300ల మంది సంఘ సభ్యులకు ఇన్సూరెన్స్ ప్రీమియం సత్యకుమార్ గారే చెల్లిస్తున్నారు.జిజిహెచ్ కాకినాడ ఆసుపత్రి కి వెళ్ళిన సంఘం సలహాదారుడు దుడ్డు నారాయణ సంఘం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం లు బాధితులను పరామర్శించి చెక్ ను అందజేశారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో జి.యం.ఆర్ సొసైటీ ముందుంటుందని బాలసుబ్రమణ్యం తెలిపారు .బైట్ ..