స్నేహపురి కాలనీలో బంగారం ఆభరణాల దుకాణంలో దుండగులు కాల్పులు

నాగోల్​(Nagole)లోని స్నేహపురి కాలనీలో బంగారం ఆభరణాల దుకాణంలో దుండగులు కాల్పులు జరిపారు. దుకాణం యజమానిని బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లారు. నాగోల్ లోని మహదేవ్ జువెల్లర్స్ లో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. దుండగులు చేసిన కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ స్నేహపురి కాలనీలో మహదేవ్ జువెల్లర్స్ కు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. వారివెంట గన్స్(Guns) తీసుకెళ్లారు. నగల దుకాణం(Jewellery Shop)లో ఫైరింగ్ చేశారు. అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం.. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే కాల్పుల్లో గాయపడినది యజమాని కల్యాణ్ గా తెలుస్తోంది. తనని తుపాకీతో బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లారని దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు(Police) వెంటనే.. ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి ఎలా జరిగింది.. అని ఆరా తీస్తున్నారు. దుకాణం యజమానితోపాటుగా ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బంగారం షాపు(Gold Shop) గురించి తెలిసిన వారే.. ఈ పనికి పాల్పడి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా యజమానితో ఎవరికైనా విభేదాలతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవరైనా వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి కొన్ని ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. వారే ఇలా చేశారా అనే విషయంపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు.