Headlines

పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను అనౌన్స్

పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. రన్ రాజా రన్‌, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నారు. RRR వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించిన డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో పవన్ హీరోగా డి.వివి దానయ్య ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రభాస్ నటించిన ‘సాహో’ పరాజయం పాలైనప్పటి నుండి దర్శకుడు సుజిత్ పని చేయడానికి ఒక ప్రాజెక్ట్ కోసం చూస్తున్నాడు. 2019లో సాహో థియేటర్లలో విడుదలైంది. ఎట్టకేలకు రెండేళ్ల ట్రయల్స్, ప్రయత్నాల తర్వాత ఓ పెద్ద ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి దర్శకత్వం వహించనున్నాడు.

సుజిత్ బేసిక్ స్టోరీ ఐడియా పవన్ కళ్యాణ్‌ని ఇంప్రెస్ చేసిందని అంటున్నారు. ఫలితంగా వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటించనున్నారు. రాజకీయాల్లో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ 2023లో ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టేందుకు అంగీకరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ డ్రామా వీర మల్లు అనే పేరుమోసిన యోధుడి జీవితం నుండి ప్రేరణ పొందింది. యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.