గేట్ పరీక్షలో మెరిసిన ఏపీ నిట్ విద్యార్థులు..విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు…
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 28: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2024) పరీక్ష ఫలితాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. సంస్థలో బీటెక్ చదువుతున్న జయంత్ హరిదాస్ పిశాల్ (బయోటెక్నాలజీ) 20 వ ర్యాంకును, పూజారి కేశవ సుబ్రహ్మణ్యం (ఎలక్ట్రికల్) 32, పెద్ది సిద్ధార్థ (కెమికల్) 45, రామిరెడ్డి వెంకట సాయి రెడ్డి (బయోటెక్నాలజీ…