టీడీపీతోనే మహిళలుకు సంక్షేమం, అభివృద్ధి..శింగనమల నియోజకవర్గం టీడిపి ఇంచార్జీ బండారు శ్రావణి శ్రీ..

 

అనంతపురం ప్రతినిధి

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం, గ్రామ పంచాయితీ వీరభద్ర కాలనీ

యందు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ “భవిష్యత్తుకి గ్యారెంటీ – బాబు షూరిటీ” కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా శ్రావణి శ్రీ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పండుగ పూట పేదలు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు గతంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చినారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి పేదలకు పండుగ రోజు సాంప్రదాయ వంటలు చేసుకునే అవకాశం లేకుండా సంక్రాంతి కానుకలు రద్దు చేశారన్నారు. అంతేకాకుండా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి పెంచి, పేదలును ఆహార భద్రతకు దూరంగా ఉంచారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల పెరిగిన ధరకు గ్యాస్ సిలిండరు పై వంట చేసే పరిస్థితి నుండి తిరిగి కట్టెల పొయ్యి మీద వంట చేసే దుస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారని శ్రావణి శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఛార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు పెంచారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలకు పట్టిన కీడు తొలగించేందుకు చంద్రబాబు టీడీపీ మినీ మ్యానిఫెస్టోలోని పథకాల ద్వారా తిరిగి మహిళలు, రైతులు, యువత, పేదల భవిష్యత్తు కు చంద్రబాబు షూరిటీతో గ్యారెంటీ లభిస్తుందన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు పథకాలు గురించి వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి పథకాల పట్ల మహిళలు సంతోషం వెలిబుచ్చారు.

 

ఈ కార్యక్రమంలో టిడిపి, సీపీఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.