సైకో పాలన పోవాలి …. విజినరి పాలన రావాలి …. నియోజవర్గం ఇంచార్జీ బండారు శ్రావణి శ్రీ …

అనంతపురం ప్రతినిధి
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం
పొడరాళ్ల గ్రామంలో పర్యటించి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో గురించి ప్రజలుకు ఇంటింటికి కరపత్రాలు శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ పంపిణీ చేశి వారికి వివరించారు.

ఈ సందర్భంగా శ్రావణి శ్రీ మాట్లాడుతూ ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందజేయబడును. నాణ్యమైన విద్యుత్ ను అందించి, రైతుల పంటల ఎండిపోకుండా చేయగల నాయకులు చంద్రబాబు నాయుడని అన్నారు.

మహిళలు కు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రైతుల భూములును భూకబ్జాలు, రైతుల మీద దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని తెలిపారు.
రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని శ్రావణి శ్రీ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.