బిటిపిఎస్ లో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం..బిటిపిఎస్ సి.ఈ , ఇంజనీర్లు , కార్మిక సంఘ నాయకులు, కార్మికులు ప్రతీజ్జ .. 

బిటిపిఎస్ లో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం..

బిటిపిఎస్ సి.ఈ , ఇంజనీర్లు , కార్మిక సంఘ నాయకులు, కార్మికులు ప్రతీజ్జ ..

బిటిపిఎస్ కార్యాలయంలో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా.. బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ప్లాంట్ సి.ఐ బిచ్చన గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు కల్పించి ఓటు ద్వారా మనకి నచ్చిన నాయకున్ని ఎన్నుకునే అవకాశం కల్పించిన అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.. అంతే కాకుండా ఈ ఓటు హక్కులో మహిళలకు చోటు కల్పించడం ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగారని ఆయన కొనియాడారు.. ప్రతి ఒక్కరు చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.. అనంతరం బిటిపిఎస్ సి.ఈ బిచ్చన్న గారు ప్లాంట్ ఇంజనీర్లు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఓటర్ల ప్రతీజ్జ చేశారు..