ఆగి ఉన్న లారీని గుద్దిన ద్విచక్ర వాహనం..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పుష్కర్ వనం వద్ద రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహన దారుడు శనివారం ఉదయం ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికీ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. హెల్మెట్ లేకపోవడం వలన తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. సారపాకకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.