పశువుల మార్కెట్ లో రైతులను కలిసిన : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

పశువుల మార్కెట్ లో రైతులను కలిసిన : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు

 

17-03-2024 తేదీన ఎమ్మిగనూరు : పశువుల కొరకు తాగునీటి వసతి కల్పిస్తాం. ఎమ్మిగనూరులో కర్నూలు రోడ్డులోని ఉన్న ఎద్దుల మార్కెట్ (ఆదివారం సంత) లో వచ్చిన రైతులను ను శ్రీమతి బుట్టా రేణుక గారు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎద్దుల మార్కెట్ ను ఆమె పరిశీలించారు. ముఖ్యంగా ప్రతి ఆదివారం జరిగే ఎద్దుల సంత లో పశువులకు తాగునీటి వసతి కల్పించాలని రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో శ్రీమతి బుట్టా రేణుక గారు స్పందిస్తూ త్వరలోనే తాగునీటి వసతిని రైతులకు తో పాటు పశువులకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు బుట్టా ప్రతూల్ గారు, ఎంపీపీ, వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, పట్టణ అధికార ప్రతినిధి, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.