అగాపే ఆశ్రమంలో అన్నదానం…

న్యూస్.9)యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో శుక్రవారం రోజున కీ”శే ఈసారి ఎరుకల గోపి కీ”శే మల్లమ్మ మనవరాలు ప్రణవి 1వ పుట్టినరోజు శుభ సందర్భంగా పాప తల్లిదండ్రులు ఆశ్రమంలోని వారికి భోజనాలు సిద్ధపరిచారు.ఒకప్పుడు యాడికి లోనే నివాసం ఉండేవారు. జీవన ఉపాధి నిమిత్తమై ముంబాయి పట్టణంలో నివాసముంటున్న జగదీష్ కవిత తమ 5వ పెళ్లిరోజు అలాగే వారి కుమార్తె ప్రణవి మొదటి పుట్టినరోజు సందర్భంగా అదే పనిగా యాడికి ప్రాంతానికి వచ్చి అగాపే ఆశ్రమంలోని వారికి అన్నదానం చేశారు.ఈ విధంగా మా పెళ్లి రోజు మా పాప పుట్టినరోజు ఒకటే అవ్వడం. ఇలాగ అగాపే ఆశ్రమంలోని వారికి అన్నదానం చేయడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది అన్నారు.ఈ కార్యక్రమంలో జగదీష్ బాబాయ్ నాసారీ గంగన్న , పిన్ని సుంకమ్మ, తమ్ముడు గంగాధర్, చెల్లెలు నవిత, బంధుమిత్రులు పాల్గొన్నారు.అగాపే ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.