నేరేడ్మెట్ కేశవ్ నగర్ వీరాంజనేయ స్వామి దేవస్థానం శనివారం నాడు ప్రథమ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి..

నేరేడ్మెట్ కేశవ్ నగర్ వీరాంజనేయ స్వామి దేవస్థానం శనివారం నాడు ప్రథమ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఇదే రోజు వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఆలయంలో ప్రత్యేక పూజలో భాగంగా కుంభాభిషేకం, అభిషేకాలు, అర్చనలు, హోమము, అన్నదాన కార్యక్రమాలు దేవస్థానం కమిటీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి కి చెందిన నాయకులు 140 డివిజన్ బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు, మాజీ వైస్ చైర్మన్ బాల్ లింగం గారు, మరియు బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ 140 డివిజన్ జగదీష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ 140 డివిజన్ ప్రెసిడెంట్ సంపత్ గౌడ్, సానాది శంకర్, కొండల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర నాయకులు పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.