పిన్నే పల్లి స్కూల్ లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..

న్యూస్.9)

యాడికి మండల పరిధి లోని పిన్నేపల్లి స్కూల్ లో ఈ రోజు తాడిపత్రి డివిజన్ జిపియంవోవో మధుసూదనరాజు జాతీయఅంధత్వనివారణకార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియుజిల్లాసివిల్ సర్జన్ డాక్టర్ సైదన్న ఆదేశాల మేరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.44మంది విద్యార్థినీ విద్యార్థులలో 7గురు విద్యార్థులకు కంటి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించారు. వారికి త్వరలో ఉచితంగా కంటి అద్దాలు అంద చేస్తామన్నారు. అవసరమయిన పిల్లలకి కంటి మందులు ఉచితంగాఅందచేశారు.

కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు జి .వేంకట నారాయణ. యస్ గోవిందమ్మ తదితరులుపాల్గొన్నారు.