నూతన వైన్ షాపులు ప్రారంభం..

న్యూస్.9)

యాడికి మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలో ఒక మద్యం షాపు, యాడికి లో రెండు మద్యం షాపులను బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ మార్చడంతో లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వారు బుధవారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వారికి చెందిన మూడు మద్యం షాపుల్లో బుధవారం రెండు మద్యం షాపులను ప్రారంభించారు. షాపు నిర్వాహకుడు జయరాం నాయక్ పూజలు నిర్వహించి షాపును ప్రారంభించారు. మరొక మద్యం షాపు రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో క్లాస్ 1 కాంట్రాక్టర్ చెవ్వ గోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టిడిపి నాయకులు చలమారెడ్డి, రవి కుమార్ రెడ్డి, నాగముని రెడ్డి, త్రినాథ్ రెడ్డి, చరణ్, రాజశేఖర్ నాయుడు, బొట్టు శేఖర్, దడియాల ఆదినారాయణ, లక్ష్మణ్, ఉప్పలపాడు రామకృష్ణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.