‘పల్లె పండుగ ‘ తో గ్రామాల అభివృద్ధి..

న్యూస్.9) యాడికి

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ‘పల్లె పండుగ’ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు యాడికి మండల మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య .శనివారం మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలో ఎంపీడీఓ వీర్రాజు మరియు ఈఓఆర్డి శశికల ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అజెండా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీర్రాజు, ఈఓఆర్డి శశికళ, ఏపీవో రమేష్,తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పరిమి చరణ్, నెట్టికంటయ్య, రంగస్వామి,శరభా రెడ్డి, నగురూరు నరసింహులు, మరియు సచివాలయం సిబ్బంది, తెదేపా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.