తవణంపల్లి మండలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తయిన

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తవణంపల్లి మండలంలోని అరగొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు,ఈ సందర్భంగా మండల కన్వీనర్ సిద్దంపల్లి హరి రెడ్డి, సరకల్లు హరి రెడ్డి, కిషోర్ రెడ్డి, మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలోనే ఏ నాయకుడు అందించలేనన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేనని వివరించారు, ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు చూసి నేను విన్నాను, నేను ఉన్నాను, అని నవరత్నాలతో సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చారు, అలాంటి ముఖ్యమంత్రి మళ్లీ మళ్లీ రావాలంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మధు కుమార్, పరమేశ్వర్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, సందీప్ రెడ్డి, దినేష్ రెడ్డి, స్వరూప్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.