ఘనంగా చొప్పెల్ల కొండాలమ్మ తీర్దమహోత్సం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారి చెంతన గల కొండాలమ్మవారి తీర్థం మహోత్సవం వైభవంగా జరిగింది.జాతీయ రహదారి చెంతనే ఉండే ఈ అమ్మ వారిని లంక గ్రామల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరంకు చెందిన శ్రీ ఉమా నృత్య నికేతన్ (ఫోన్ నెం.94414 72735)విద్యార్థులు అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆద్యంతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.గ్రామ దేవతల ప్రత్యేకతలు,ఉగాది విశిష్టత,రాజమహేంద్రవరం గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఈ నృత్య ప్రదర్శన సాగింది. జాతీయ రహదారిపై వెళ్ళే వారు సైతం ఆగి ఈ ప్రదర్శనను తిలకించారు.