మృతులు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత.– డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు..

మండల కేంద్రమైన ఆలమూరు అంబేద్కర్ కొలనీలో వేర్వేరు కుటుంబాలకు చెందిన సరిపెళ్ల గంగమ్మ,అంబటి లక్ష్మమ్మ గురువారం ఆనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందడంతో విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,ప్రముఖ పారిశ్రామికవేత్త, పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు, డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలను పరామర్శించి, దిగులు పడవద్దు,అధైర్య పడవద్దు మీ కుటుంబానికి అండగా మేముంటామని తెలియజేసి తక్షణ ఆర్థిక సహాయముగా ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు చొప్పున మొత్తం 10 వేల రూపాయలను,50 కేజీల బియ్యాన్ని మొత్తం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఆయన వెంట గొల్లపల్లి కిరణ్,అశోక్,రేవు ప్రకాష్,మొసలి భాస్కర్,బొట్టు చంటీ రాజ్,కత్తుల రమణ,వంశీ,యాళ్ల లక్ష్మణ రావు,ముంగమూరు పణశయ్య,ముర్రా శ్రీను తదితరులు ఉన్నారు._