గూడెంలో 23 కిలోల గంజాయి సీజ్ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్…

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం: నవంబర్ 14:

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోగంజాయి తరలిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై కె.సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ , డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఆదేశాలతో తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎస్.వి నాగరాజు కి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటిరోజున ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇరువురు యువకులు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న షేక్ అక్బర్, ఓరుగంటి షాలేం రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. మత్తు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆయన వెంట ఎస్సై జీజే ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీను, కానిస్టేబుల్స్ సి.శ్రీనివాసరావు, కె.రాజు,కె.మహేష్ ఉన్నారు.