నా రైతుల కోసం నేను ఎక్కడికైనా వస్తా యాడికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తి మార్కెట్ యార్డులో పత్తి పంటను కొనుగోలు చేయాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో యాడికి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

న్యూస్. 9) నా రైతుల కోసం నేను ఎక్కడికైనా వస్తా యాడికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తి మార్కెట్ యార్డులో పత్తి పంటను కొనుగోలు చేయాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో యాడికి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగ జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇళ్లలోనే పంటను నిల్వ ఉంచుకున్నారన్నారు. సిసిఐ ద్వారా ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించి వెంటనే ప్రభుత్వం రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి రవికుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, పరిమి చరణ్, నాగ ముని రెడ్డి, బీసీ సెల్ అధికార ప్రతినిధి మధురాజు, వడ్డెర సంఘం అధ్యక్షుడు బొట్టు శేఖర్, లక్ష్మణ్, విజయ్, పుప్పాల సర్పంచ్ దేవేంద్ర, మాజీ వైస్ ఎంపీపీ త్రినాథ్ రెడ్డి, మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు అరుణ, నిట్టూరు సర్పంచ్ ఈశ్వరమ్మ, రాజారెడ్డి, దివాకర్ రెడ్డి, తాండ్ర విక్రమ్ తదితర యాడికి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.