ఉచిత న్యాయ సేవా సదస్సు..

 

పెనుగొండ మండలం చంద్రగిరి గ్రామంలో టీం బంక్ కలెక్ట్ ఆర్థిక సహకారంతో దుర్గా శక్తి సొసైటీ ఉచిత న్యాయ సేవా సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అధ్యక్షకులు లక్ష్మమ్మ అధ్యక్షత వహిస్తూ బాల్య వివాహాలు మహిళా నిర్ణయాధికారం డబ్బు ఆరోగ్యం విషయం పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సొసైటీ పాలకవర్గం మరియు సిబ్బంది బాల్యవివాహాలు వల్ల కలిగే అనర్థాల గురించి నాటక రూపంలో ప్రదర్శన చేయడం జరిగింది సొసైటీ ప్రధాన కార్యనిర్వహణ అధికారి కవిత మహిళలు ఏ విధముగా హింసకు గురు అవుతున్నారు అనే విషయం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాశక్తి ప్రోగ్రాం మేనేజర్ సుకన్య గౌరీ మహాశక్తి సీఈఓ రమజ అశ్విని అలాగే దుర్గాశక్తి పాలకవర్గం సిబ్బంది పాల్గొనడం జరిగింది