తెదేపా తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు..

తెదేపా తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు

 

ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం

ధర్మవరం నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో పరిటాల శ్రీరామ్ ను గెలిపిస్తాం

 

పార్టీలో చేరిన తాడిమర్రి మండలం చిల్ల కొండయ్య పల్లి వైసిపి నాయకులు

 

రాష్ట్రం 20 ఏళ్లు వెనకబడిపోయిందని రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని వైసిపి నుండి తెదేపాతీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు అన్నారు

 

బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తాడిమర్రి మండలం చిల్ల కొండాయపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ కు చిల్ల కొండాయ పల్లి గ్రామంలో అడుగడుగునా మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిల్ల కొండయ్య పల్లికి చెందిన వైసిపి నాయకులు నారాయణస్వామి,చిన్న, శివయ్య తదితరులకి పరిటాల శ్రీరామ్ కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ గారిని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు