నా మిత్రుడుబొలిశెట్టిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం.. టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి సభలో టిడిపి తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వలవల బాబ్జి..

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చ్ 16:

రాబోయే ఎన్నికల్లో కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం అని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో జనసేన బిజెపి తెలుగుదేశం ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో నాలుగున్నర ఏళ్ళు నియోజవర్గం లో పార్టీ బాధ్యతలు మోసిన తాను ఎమ్మెల్యే సీటు ఆశించడం కానీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగాలు సైతం సిద్ధపడి పనిచేస్తున్నారని కూటమి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి వస్తున్నాయన్నారు. కూటమి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి రాష్ట్ర నాయకులకు కానుకగా ఇద్దామన్నారు. దగా కోరు జగన్ ప్రభుత్వాన్ని మట్టి కల్పించడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. రాబోయే 30 రోజులు అత్యంత కీలకమని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ఆ ప్రభుత్వంలో మనకి పూర్తి న్యాయం జరుగుతుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తే చేసే సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ జగన్ దాస్టిక ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలన్నారు. బిజెపి నాయకులు భోగి రెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర శ్రేయస్సు కోసం మన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసును రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రన్న పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో ముందుకు వెళ్దాం అన్నారు.