యాడికిలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదు..

న్యూస్.9)యాడికి–;

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ శనివారమే అమల్లోకి రాగా యాడికి లో మాత్రం ఆదివారం ఉదయం 10 గంటల వరకు కోడు అమల్లోకి రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. అన్ని పట్టణాల్లో వైయస్సార్, ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేయగా యాడికి లో మాత్రం అధికారులు ఎన్టీఆర్ వైఎస్ఆర్ విగ్రహాలకు ఇంతవరకు ముసుగులు కప్పలేదు. దీంతో పలువురు రాజకీయ విశ్లేషకులు అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. పలు పార్టీల నాయకులు తమ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తొలగించారు. అధికారులు మాత్రం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం మరిచారు. కొన్నిచోట్ల పలు పార్టీలకు చెందిన నాయకుల ఫ్లెక్సీలు జెండాలు కూడా దర్శనమిస్తున్నాయి.