మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు..

న్యూస్ నైన్ టీవీ పులికొండ

18-03-2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణం : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “బుట్టా రేణుక” గారు, ఎమ్మిగనూరు పట్టణంలో 24వ వార్డు నాగప్ప కట్ట నందు స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేసుకొని అనంతరం వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.నాయకులు  కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు లో వైసీపీ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు.*

 

*ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ గారు, రాష్ట్ర శాప్ నెట్వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వేంకటేష్ గారు, 24వ వార్డు కౌన్సిలర్ రామంజినమ్మ  గారు, పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వార్డు సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.*