సంక్షేమ సారథిని ఆశీర్వదించండి : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు.

న్యూస్ నైన్ టీవీ పులికొండ

 

 

సంక్షేమ సారథిని ఆశీర్వదించండి : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు.

 

19-03-2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణం : గత ఐదేళ్లు గా అవినీతికి తావు లేకుండా ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించిన సంక్షేమ రథసారథి సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరోసారి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తపై ఓటు వేసి గెలిపించాలంటూ  ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “బుట్టా రేణుక” గారు ప్రజలను కోరారు. ఎమ్మిగనూరు పట్టణంలో 22వ వార్డులో వార్డు కౌన్సిలర్ డిస్ కేశవరెడ్డి తో కలసి ఆమె ఇంటింటికీ వెళ్లి జగనన్న పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వ్యాపారులను ఓటర్లను కలసి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల ఊసే ఉండదని హెచ్చరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే వార్డు పరిధిలో మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర  శాప్ నెట్వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వేంకటేష్ గారు, పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య, పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, కౌన్సిలర్లు అమాన్, సుధాకర్, ఇన్ ఛార్జ్ లు పాల శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ రమేష్, కోటకొండ నరసింహులు, విశ్వనాథ్, తార రాజశేఖర్, రామంజి రెడ్డి, సోమేశ్, చంద్రశేఖర్, నాయకులు మహేశ్వర్ రెడ్డి, మాచాని రఘునాథ్, రామలింగారెడ్డి, డీలర్ మధు, గట్టు ఖజా, జి యమ్ బాషా, రజాక్, సురేష్ చౌదరి ఫయాజ్, ఉబేద్, సోషల్ మీడియా టీం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.