యాడికి మండల కేంద్రంలోని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మండల కమిటీ ఎన్నిక — అధ్యక్షుడిగా సారెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక ..

న్యూస్.9)

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని బోగలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మండల కమిటీని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు యం.జోగి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాప్ యాడికి మండల అధ్యక్షునిగా సారెడ్డి రామచంద్రారెడ్డి (ఆంధ్రప్రభ)ను గౌరవాధ్యక్షునిగా శివ షణ్ముఖరెడ్డి (ప్రజాశక్తి)ని ఉపాధ్యక్షునిగా యం. నారాయణస్వామి (మన జన ప్రగతి)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే సెక్రటరీగా రఘు (గురుప్రసాద్) (నేటి సూర్య)ని, సహాయ కార్యదర్సులుగా ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, జానపాటి శ్రీనివాసులను ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈసి మెంబర్లుగా శర్మాస్ వలి, హుస్సేన్ భాష, బండారు బాలకృష్ణ, సిద్ధవటం తిరుమలరెడ్డి, ఎస్ రహమతుల్లా, చిట్టెపురెడ్డి రామసుబ్బారెడ్డి, గూండా సుధాకర్ లను నియమించారు. అనంతరం నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు సారెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడు ఎం జోగిరెడ్డి జాప్ కమిటీ సభ్యులు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మండల విలేకరులకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నేను జాప్ జర్నలిస్టుల సంఘం సభ్యులు కలిసి కట్టుగా ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నా బాధ్యతను విస్మరించనన్నారు.