నిఘా నేత్రాలు ఉన్నాయి జాగ్రత్త యాడికి మండలంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని పలు గ్రామాల్లో అనగా యాడికి, వేములపాడు, రాయలచెరువు, కోన ఉప్పలపాడు, గుడిపాడు మొదలగు గ్రామాలలో వివిధ రద్దీ ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చి సంఘవిద్రోహులను గుర్తించి తగిన విధమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది..

న్యూస్.9) నిఘా నేత్రాలు ఉన్నాయి జాగ్రత్త యాడికి మండలంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని పలు గ్రామాల్లో అనగా యాడికి, వేములపాడు, రాయలచెరువు, కోన ఉప్పలపాడు, గుడిపాడు మొదలగు గ్రామాలలో వివిధ రద్దీ ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చి సంఘవిద్రోహులను గుర్తించి తగిన విధమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లర్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు గాని,సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గాని, వీడియోలు గాని, ఆడియోలు విడుదల చేయరాదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగాను ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారి వివరాలను తెలియజేయవలెను. అట్టి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు