ఎవరు లేని వారికి ఆ నలుగురు తోడై అంతక్రియలు..

న్యూస్.9)

యాడికిమండల కేంద్రంలోని తిప్పారెడ్డి పల్లె రోడ్డులో నివసిస్తున్న నేతి బొట్టు కుళ్లాయమ్మ అనారోగ్యంతో బుధవారం మరణించడం జరిగింది. మృతురాలికి భర్త పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆమె అన్నలు యాడికి ఫౌండేషన్ మరియు వేడుకాపుర ఫౌండేషన్ ని సంప్రదించడం జరిగింది. బంధువులు ఎవరు అంత్యక్రియలను చేయడానికి సుముఖంగా లేకపోవడంతో ఫౌండేషన్ తరపున సభ్యులు వెళ్లి నేతిబొట్టు కుళ్లాయమ్మ అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది. ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలను గుర్తించి మేము కూడా మీతో నడుస్తామని ఇద్దరు కొత్త సభ్యులు పాడే మోయడానికి ఫౌండేషన్ వారితో కలిసి నడిచారు. అయినవాళ్లు ఎవరూ లేని వారికి ఆ నలుగురు తోడై అంత్యక్రియలు పూర్తిచేయడం వల్ల మీరు ఎంతో పుణ్యం కట్టుకుంటున్నారని నేతిబొట్టు కుల్లాయమ్మ బంధువులు ఫౌండేషన్ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సెక్రటరీ

ఆలూరు చంద్రశేఖర్,రెడ్డి ,ధ్రువ నారాయణ ,బడిగించల వేణు,పి.రామాంజనేయులు,గాంధీజీ స్కూల్ రామ మోహన్,

పల్లా ఆంజనేయులు,

జొన్నల వెంకటేష్,

టి లక్ష్మికాంతమ్మ , పోలిశెట్టి రామాంజనేయులు,నేతి బొట్టు రంగనాయకులు పాల్గొనడం జరిగింది.