ఇప్పల్ దారి గ్రామంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులతో గ్రామ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి అధికారులు గ్రామసభ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పొడు పట్టాలు రైతులకు ఇవ్వాలంటు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఒకపక్క అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. వివారాల్లోకి వెళితే అదిలాబాద్ జిల్లా బోతు మండలం ఇప్పల్ దారి గ్రామంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులతో గ్రామ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి అధికారులు గ్రామసభ నిర్వహించారు అయితే గ్రామసభలో 55 దరఖాస్తులు తీసుకోగా అందులో 28 దరఖాస్తులు నాట్ ఇన్ పొజిషన్ లో ఉండడంతో గత 30, 40 సంవత్సరాల నుండి అదే భూమిలో పంట పండించుకొని బతుకుతున్నామని గత మూడు సంవత్సరాల కింద అటవీశాఖ అధికారులు వచ్చి ప్రభుత్వం ఎప్పుడైతే పోడు భూములకు పట్టాలు ఇస్తుందని జీవో జారీ చేసినప్పుడు అప్పుడు మీకు పట్టాలు ఇస్తామన్నారు అప్పటి వరకు ఈ భూమిలో వ్యవసాయం చేయవద్దని తెలపడంతో మేము అక్కడ వ్యవసాయం చేయక కూలీలు చేస్తూ కాలం వెళ్లదీసామని ఈరోజు అప్లికేషన్లు నాటిన్ పొజిషన్లో ఉండడం వల్ల మాకు మా భూమి కూడా దక్కదని ఆవేదన గురవుతున్నామని లబ్ధిదారులు తెలిపారు ప్రభుత్వం వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న మాకు వెంటనే నాటిన్ పొజిషన్లో ఉన్న భూములకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని గ్రామసభలో తీర్మానం చేసి జిల్లా అధికారులకు ప్రభుత్వానికి తెలుపుతామని గ్రామ సర్పంచ్ తెలిపారు.
బండారి శ్రీధర్ రెడ్డి పిప్పల్లరి గ్రామ సర్పంచ్.
అంజయ్య… పోడు వ్యవసాయదారుడు