Headlines

Editor

వైసీపీ ప్రభుత్వంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు

  కొత్తపేట మండలం – ఖండ్రిగ జంగాల పేట గ్రామం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయని బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం కండ్రిగలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడ్డ రైతులకు వారి ధాన్యం డబ్బులు వారి ఖాతాలో వెయ్యడానికి కూడా ప్రభుత్వం రెండు, మూడు నెలలు జాప్యం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు…

Read More

వినాయకుడు సేవలో మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా : కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకున్ని దర్శించుకోవడం ఆనందంగా వుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్వామివారిని విద్యాశాఖ మంత్రి, ఆయన సతీమణి మాజీ ఎంపి బొత్స ఝాన్సీ లతో పాటు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరితో పాటు చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు స్వామివారినీ దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం ఈ.వో వెంకటేశు… ఈ కార్యక్రమంలో చిత్తూరు…

Read More

యానాదుల సత్తెమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సత్యానందరావు…

  కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో ఖండ్రిగ పేట బండారు సత్యానందరావు కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సత్తెమ్మతల్లి అమ్మావారు,పోతురాజు స్వామి మరియు వినాయక స్వామి వార్ల నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యి రాష్ట్ర సుభిక్షంగా వుండాలని,ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లేలా దీవించాలని ప్రార్థించారు. యానాదుల సంఘం ఆద్వర్యంలో చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా సోదరీమణుల పలికిన స్వాగత అభిమానానికి కృతజ్ఞతలు తెలిజేసినారు.

Read More

ఎక్కడా లేని పెట్రో ధరలు మన రాష్ట్రంలోనే, ఇదేం కర్మ మన రాష్ట్రానికి పెట్రో బాదుడుతో ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్యుల నడ్డి విరుస్తోంది…

ఎక్కడా లేని పెట్రో ధరలు మన రాష్ట్రంలోనే, ఇదేం కర్మ మన రాష్ట్రానికి పెట్రో బాదుడుతో ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్యుల నడ్డి విరుస్తోంది… బండారు సత్యానందరావు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ పై అధిక పన్ను విధిస్తూ ధరల పెరుగుదలకు కారణం అవుతుందని సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు….

Read More

రోడ్డు ప్రమాద బాధితుడికి చిర్ల పరామర్శ ఆర్ధిక సహాయం

  రోడ్డు ప్రమాదంలో గాయపడిన రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన చిట్టూరి వెంకన్నను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దేవరపల్లి గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించి 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు.

Read More

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన మామిడిశెట్టి సూర్యనారాయణ.. కార్యకర్తలు 25 వేల రూపాయలు మొత్తం 55 వేల రూపాయలు ఆర్ధిక సహాయం

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన మామిడిశెట్టి సూర్యనారాయణ కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 30 వేల రూపాయలు, గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 25 వేల రూపాయలు మొత్తం 55 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు.

Read More

లింగాల గణపురం మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ ACP రఘు చందర్

జనగామ జిల్లా, లింగాల గణపురం మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ ACP రఘు చందర్, నెల్లుట్ల పరిసర ప్రాంతంలో గత సంవత్సరం జరిగిన దొంగతనం కేసులోని A5 నిందితుడు సోనూసింగ్ చౌహాన్ అలియాస్ సంగ్రహామ్ సింగ్ ను అరెస్ట్ చేసి ఒక సెల్ ఫోను మరియు 1.5 తులాల బ్రాస్లెట్ ను రికవరీ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసీపీ రఘు చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ…

Read More

రాంపల్లి లో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ సుగుణ

  కొండపాక: కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో సోమవారం సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ ర్యాగల్ల సుగుణదుర్గయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుగుణ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన పది లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. అర్హత గల మదిర గ్రామాలన్నింటినీ సీ.ఎం కేసీఆర్ గ్రామపంచాయతీలుగా గుర్తించి పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేశారని అన్నారు….

Read More

పత్తి పంటకు 15000 మద్దతు ధర కల్పించాలని పెద్ద ఎత్తున రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రం లో పత్తి రైతులు తాము పండించిన పత్తి పంటకు 15000 మద్దతు ధర కల్పించాలని పెద్ద ఎత్తున రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీస్ లు బలవంతంగా రైతులను చెల్లా చెదురు చేశారు.ఈ కార్యక్రమానికి రైతు సంఘాలు, అఖిల పక్ష నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.ఈ సందర్బంగా రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు…

Read More

మానవత్వనికి నిదర్శనం దాసరి బాలవర్ధనరావు

పెద్దఅవుటపల్లి గ్రామ ఒకటవ వార్డు మెంబర్ (ముస్లిం పేట) మరియు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త అయిన పటాన్ అల్లా బాక్షు తండ్రి గారైన కాళేష్ గారు (వయస్సు 58) అనారోగ్యంతో స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈ రోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు గారు అల్లాభక్షు కుటుంబాన్ని పరామర్శించారు. మేము అండగా ఉంటామని తెలియచేశారు. మానవత్వనికి నిదర్శనం దాసరి బాలవర్ధనరావు గారు. హ్యాట్స్ఆఫ్ సార్. మీలాంటి ఉండబట్టే రాజకీయాలు కలుషితం కాకుండా ఉన్నాయి. కిరణ్…

Read More