Headlines

న్యూ ఇయర్ వేళ విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..

న్యూ ఇయర్ జోష్ మొదలైంది. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు హోటళ్లు, ఈవెంట్ వేదికలు, కొన్ని ప్రైవేటు సంస్థలు భారీ ఏర్పాట్లే చేశాయి. దోస్తులంతా కలిసి దావత్ లకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. వేడుకల దృష్ట్యా.. ప్రభుత్వం కూడా మద్యం షాపులు, బార్లను రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు…

Read More

తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనలు

తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం వేళ నిరుద్యోగులను ఖుషీ చేస్తూ.. సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తాజాగా.. మరో 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. కళాశాల విద్యాశాఖ పరిధిలో 544 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. విద్యాశాఖ పరిధిలోనే 142 పోస్టులతో మరో నోటిఫికేషన్ వెలువరించింది. పురపాలక శాఖలో 156 ఖాళీలు భర్తీ చేసేందుకు ఇంకో ప్రకటన జారీ చేసింది. గతంలోనే విడుదలై పలు వివాదాల కారణంగా రద్దయిన మోటార్ వెహికల్ ఇన్…

Read More

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో (NCRB) వెల్లడించిన నేపథ్యంలో… రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రస్తావిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విధానాలే రైతును సంక్షోభంలో పడేశాయని… 9 ఏళ్లలో 7,069 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగటున రోజుకి ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది కౌలు రైతులేనని……

Read More

పింఛన్ల తొలగింపును నిలిపివేయాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి లేఖ

పింఛన్ల తొలగింపును నిలిపివేయాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అధికార పీఠాన్ని ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వాతాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరు ఇచ్చిన హామీలు మరిచిపోయారా అని లోకేష్ ప్రశ్నించారు. గద్దె ఎక్కినప్పటి నుంచి పింఛన్ల నయవంచనకి దిగారని, తెలుగుదేశం ప్రభుత్వం రూ.200 ఉన్న పింఛనుని పదిరెట్లు పెంచి రూ.2000 చేస్తే, వైసీపీ రూ.3000 పింఛను చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన…

Read More

తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. “ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ కేంద్రంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు స్ధాపించిందని సిఎం గుర్తు చేశారు. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్‌ సైన్స్, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్‌ సైన్స్‌ మరియు…

Read More

సంక్రాంతికి విజయవాడ నుంచి వెయ్యి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ ప్రయాణాల కోసం విజయవాడ ఆర్టీసీ రీజియన్ పరిధిలో వెయ్యి బస్సుల్ని నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక సర్వీసుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. జనవరి ఆరో తేదీ నుంచి 18 తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అరవయ్యేళ్లకు పైబడిన వారికి డిజిటల్ ఆధార్‌ కార్డు చూపిస్తే 25శాతం రాయితీ కల్పించనున్నారు. వయసు ధృవీకరణ చూపించిన వారికి టిక్కెట్లపై 25శాతం…

Read More

పెళ్ళి మీదకు రాహుల్ గాంధీ మనసు మళ్ళిందా.?

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయనకు ఓ విదేశీ స్నేహితురాలు వుండేది. ఆమెతో రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, రాహుల్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే వుండిపోయారు. రాహుల్ పెళ్ళెప్పుడు.? అని తరచూ చర్చ జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ తరహాలోనే రాహుల్ కూడా పెళ్ళి చేసుకునే ఆలోచన వున్నట్లు కనిపించరు. భార్య ఎలా వుండాలంటే.. తాజాగా తన భార్య ఎలా వుండాలన్నదానిపై రాహుల్ గాంధీ…

Read More

రిమోట్ ఓటింగ్ : ఓటేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళక్కర్లేదు.

ఉపాధి నిమిత్తం సొంతూళ్ళను వదిలి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు ఎంతోమంది వుంటారు. అలాంటివారు ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఓ ప్రసహనం. ప్రయాణ ఖర్చులు భరించలేకపోవడం అనేది ఇక్కడ పెద్ద సమస్య. అయితే, ఇకపై సొంతూరికి వెళ్ళి ఓటెయ్యాల్సిన అవసరం లేదు. రిమోట్ ఓటింగ్ ద్వారా ఎక్కడుంటే అక్కడి నుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది….

Read More

ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్, రాచకొండకు కొత్త సీపీ

కొత్త డీజీపీగా ఎవరిని నియమిస్తారని జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలను చేపట్టింది. ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించగా… అవినీతి నిరోధకశాఖ డీజీగా రవి గుప్తా, రాచకొండ కమిషనర్‌గా డీఎస్‌ చౌహాన్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్‌, శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్‌ కుమార్‌జైన్‌ నియమితులయ్యారు. అంజనీ…

Read More

కూతుర్ని వదలరా.? ట్రోల్స్‌పై కన్నీళ్ళు పెట్టుకున్న మంత్రి రోజా.!

సినీ నటి, వైసీపీ నేత, ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి తాజాగా కంటతడి పెట్టారు. రోజా కూతురి విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్. ఆమెది మృదు స్వభావం. కానీ, ఆమె మీద కొందరు వ్యక్తులు ట్రోలింగ్ చేస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు..’ అంటూ రోజా కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల…

Read More