Headlines

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఐరాలలో తాహాసిల్దార్ సుశీలమ్మ, ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం.

చిత్తూరు జిల్లా : పూతలపట్టు నియోజకవర్గం, మండల కేంద్రమైన ఐరాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఐరాల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆవరణలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు పై తహసిల్దార్ సుశీల, మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ ఓటర్లకు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఐరాల పురవీధుల్లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, మరి ఓటు హక్కు పై అవగాహన అందరూ కలిగి ఉండాలని నినాదాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అహ్మద్ బాషా, వీఆర్వోలు రాదయ్య, ఉషారాణి, పంచాయతీ కార్యదర్శి హరిబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాగరాజ, మరియు ఐరాల పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.