డీజే పెట్టిన వారి మీదా కేసు నమోదు..!

న్యూస్ 9 tv రిపోర్టర్

మంథని, పెద్దపల్లి

కరీంనగర్, తెలంగాణ

పెద్దపల్లి జిల్లా, మంథని మండలం లో అనుమతులు లేకుండా గణేష్ నిమజ్జనం సమయంలో డీజే పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన మంథని ఎస్ఐ డేగల రమేష్.

వివరాల్లోకి వెళ్తే డీజే యజమానులు అందర్నీ గతంలో మంథని ఎమ్మార్వో ముందు అనుమతులు లేకుండా డీజే పెట్టినందుకు బైండ్ ఓవర్ చేయడమైనది. నిన్నటి రోజున గణేష్ నిమజ్జన సమయంలో కాకర్లపల్లి కి చెందిన అరవింద్, ఖైర్ మరియు మరొక వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా డీజే పెట్టినందుకు వారిపై కేసు నమోదు చేయడమైనది.

ఎవరైనా అనుమతులు లేకుండా డీజే పెట్టినచో వారిపై కేసు నమోదు చేసి అట్టి డీజేలను సీజ్ చేయడం జరుగుతుందని మంథని ఎస్ ఐ డేగల రమేష్ తెలిపారు.