Headlines

గుంజపడుగులో కార్టన్ అండ్ సెర్చ్.. మంథని:సిఐ బి రాజు గౌడ్..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల.రవీందర్

మంథని, పెద్దపల్లి

కరీంనగర్, తెలంగాణ

 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని గుంజపడుగు

గ్రామంలో తెల్లవారుజామున రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాలతో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ B రాజు గౌడ్, మంథని ఎస్సై డేగల రమేష్ ఆధ్వర్యంలో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది .గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సరైన పత్రాలు లేనటువంటి 21 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేయడం జరిగింది. గ్రామంలోని యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పడం జరిగింది . గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని చెప్పడం జరిగింది. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని సూచించారు.అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించడం జరిగింది.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని తెలియజేసారు . గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు .మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు గౌడ్, మంథని ఎస్ ఐ డి రమేష్, సర్కిల్ పరిధిలోని ముత్తారం ఎస్ ఐ నరేష్, రామగిరి ఎస్ ఐ చంద్రకుమార్ లతో పాటు మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.