పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ కీ వినతి పత్రం.. అక్రమ నిర్మాణాలు, భూకబ్జాదారుల మీదా చెర్యలు తీసుకోవాలి.. అరెల్లి కిరణ్ గౌడ్, బెజ్జంకి డిగంబర్..

న్యూస్ 9 tv రిపోర్టర్

చేరాల రవీందర్

9640420733

మంథని, పెద్దపల్లి…

 

పెద్దపల్లి జిల్లా,

మంథని పట్టణం శివారు లోని గౌడ్స్ మరియు పద్మశాలి ఫ్లాట్స్ లలో అక్రమ నిర్మాణాలపై, భూకబ్జాదారులపై చర్య తీసుకోవాలని కోరుతూశనివారం రోజున స్థానిక పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మంథని తహసీల్దార్, మంథని మున్సిపల్ కమిషనర్ లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఫ్లాట్స్ లలో అక్రమ మార్గంలో ఫ్లాట్లు పొందిన వారిని వెంటనే గుర్తించి వాటిని రద్దు చేసి అర్హులైన నిజమైన నిరు పేదలకు కేటాయించాలని అధికారులను కోరడం జరిగింది.

దీనిపై అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ స్పందిస్తూ త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి అక్రమ మార్గంలో ఫ్లాట్లు పొందిన వ్యక్తులను గుర్తించి చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సూరయ్యపల్లి గ్రామ మాజీ వార్డ్ మెంబర్ అరల్లి కిరణ్ గౌడ్, విద్యార్థి జేఏసీ నాయకులు బెజ్జంకి డిగంబర్, నాయకులు బూడిద తిరుపతి పాల్గొన్నారు.