తాతపూడి లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు

ఈరోజు ది.20.04.2023 న తాతపూడి గ్రామంలో అంగర పి.హెచ్.సి వైద్యాధికారులు డా.పి.ఎన్.ఎస్.డి.రత్న కుమారి మరియు డా.జె. అనూజ ప్రియాంక అద్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డా.జె.అనూజ ప్రియాంక మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ నెలా 1వ సోమవారం సచివాలయం వద్ద మరియు 2వ సోమవారం రామాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ వైద్య శిభిరం నందు గర్భిణీస్త్రీ లను, బాలింతలను మరియు శస్త్రచికిత్సలు జరిగి లేవలేని స్థితిలో ఉన్న వారిని వారి ఇంటి వద్దనే పరీక్షించి మందులు అందజేయడం మరియు అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఈ వైద్య శిభిరములో 102 మందికి వైద్యసేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి.శ్రావణి, ఎం‌పి‌టి‌సి జె.వెంకటలక్ష్మి, వైద్య ఆరోగ్య సిబ్బంది, 104 సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.