నిరుపేద కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన నూనె కుమార్

నిరుపేద కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన నూనె కుమార్

వైద్యం కోసం నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు .

నూనె కుమార్
అధ్యక్షులు
బారాస కొండపాక మండలం

కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఫారుక్ అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స కోసం నాలుగు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అని తెలుసుకొని బారాస అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారికి తెలపగా ఆ వెంటనే నూనె కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి సమస్యను విన్నవించగా ఫారూఖ్ అనే వ్యక్తి వైద్య ఖర్చులకు అయ్యే నాలుగు లక్షల రూపాయలను గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి సహాయ నిధితో ఈరోజు నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయడం జరిగింది.
దీనిని ఈరోజు తెలంగాణ అంబేద్కర్ సెక్రటేరియట్ హైదరాబాదులో నూనె కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఫారుక్ తండ్రి ఇమామ్ గారికి నాలుగు లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఫారుక్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైన మాకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న మాకు నాలుగు లక్షల రూపాయల సహాయాన్ని అందించిన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
దీనికి సహకరించిన బారాస మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…….